ఎండల తీవ్రత పెరగటంతో విజయనగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. రోజు తప్పించి రోజు మున్సిపల్ నీరు సరఫరా చేసినప్పటికీ సరిపడకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతన్నారు. గొడగల వీధి, బంగారమ్మ కాలనీ, కటిక వీధికి చెందిన వారు పోలీస్ బ్యారెక్స్కి ఆనుకొని ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద నుంచి నీటిని తీసుకెళ్తున్నారు. సమస్య పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
0 Less than a minute


